
బాలీవుడ్ లవ్లీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ త్వరలో మమ్మీ-డాడీ కాబోతున్నారు. ఏప్రిల్ 23, 2025న ముంబైలో ఒక హాస్పిటల్ దగ్గర కియారాను ఫొటోలు తీసిన పాపరాజీపై సిద్ధార్థ్ సీరియస్ అయ్యాడు. కియారా కారులో కూర్చుని ఉంటే, పాపరాజీ గుంపు కార్ డోర్ దగ్గరవరకు వచ్చి ఫొటోలు క్లిక్ చేస్తుండటం చూసి సిద్ధార్థ్ కోపంతో “వెనక్కి జరగండి, నాకు కోపం తెప్పించకండి మర్యాద పోగొట్టుకోకండి ” అని గట్టిగ అరిచాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కొందరు ఫ్యాన్స్ “సిద్ధార్థ్ కరెక్ట్గానే చేశాడు, పాపరాజీ కాస్త దూరంగా ఉంటే బాగుండు” అని అంటున్నారు. మరి కొంతమంది “పాపరాజీ వాళ్ల జాబ్ చేస్తున్నారు, సెలబ్స్ అర్థం చేసుకోవాలి” అని చెప్పారు. కియారా ఈ సమయంలో కంఫర్ట్గా ఉండాలని సిద్ధార్థ్ ఇలా రియాక్ట్ అవ్వడం చూసి చాలా మంది “రియల్ హీరో” అని మెచ్చుకున్నారు. ఈ గొడవ సెలబ్స్కి పర్సనల్ స్పేస్ ఎంత ఇంపార్టెంట్ అనే టాపిక్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.
నాకైతే సిద్ధార్థ్ చేసింది బాగానే అనిపిస్తుంది. హాస్పిటల్ చెకప్ కోసం వచ్చిన కియారాను ఇలాంటి టైంలో పాపరాజీ అతి ఉత్సాహం తో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కానీ పాపరాజీ కూడా వాళ్ల పని కోసం ఇలా చేస్తుంటారు కాబట్టి, ఇద్దరి మధ్య ఒక బ్యాలెన్స్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. కొంచం దూరంగా వుంది ఫోటొలు క్లిక్ చేసి ఉంటే బాగుండేది.. సిద్ధార్థ్-కియారా తల్లిదండ్రులుగా మారేందుకు రెడీ అవుతుంటే, ఫ్యాన్స్ అంతా సంతోషంగా వెయిట్ చేస్తున్నారు. మీరు ఈ గొడవ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? కామెంట్లో చెప్పండి!